భారత్‌లో పెరిగిన కేసులు.. తగ్గిన మరణాలు

by  |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా దేశ వ్యాప్తంగా 45,892 కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ సోకిన వారి సంఖ్య 3,07,09,557కి చేరింది. నిన్న ఒక్కరోజే 817 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4,05,028కి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 44,291 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,98,43,825 మంది ఆస్పత్రుల నుంచి పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం దేశంలో 4,60,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 36,48,47,549 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్‌లో స్పష్టం చేసింది.


Next Story