దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు

by  |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా తీవ్రత తగ్గు ముఖం పట్టింది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,506 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 895 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 41,526 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,54,118 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,08,37,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,08,040 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.

Next Story

Most Viewed