దేశంలో స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు..

by  |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4వేల మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో దేశంలో 2,62,317 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో గురువారం ఒక్కరోజే 18,75,000 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 31 కోట్ల 13లక్షలు దాటింది. కరోనా కట్టడిలో భాగంగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 17.92 కోట్ల టీకా డోసుల పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.


Next Story