భారత్‌లో కరోనా తగ్గుముఖం.. పెరుగుతున్న మరణాలు

by  |
corona, india
X

దిశ, వెబ్‎డెస్క్ : భారత్‎లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న వేళ మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,65,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,94,800కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,460 మంది మరణించారు . అదే సమయంలో 2,76,309 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,25,972 పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,54,54,320 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 21,14,508 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు కొవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.


Next Story