- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : భారత్ లో 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 336 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,301 చేరినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, 56 మంది కరోనాతో మరణించారు. ఇందులో 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు చనిపోయారు. 157 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవడమే కాదు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్యా ఎక్కువగానే ఉన్నది. ఈ రాష్ట్రంలో 335 మందికి కరోనా సోకగా 16మంది మృతి చెందారు. తమిళనాడులో 309 మందికి ఈ మహమ్మారి సోకింది. ఒకరు మరణించారు. తెలంగాణలో 107 మందికి వైరస్ అంటుకోగా ముగ్గురు చనిపోయినట్టు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ తెలిపింది.
Tags: Coronavirus, highest, cases, deaths, crosses, mount
Next Story