ఇండియాలో 24 గంటల్లో.. 336 కేసులు

by  |
ఇండియాలో 24 గంటల్లో.. 336 కేసులు
X

న్యూఢిల్లీ : భారత్ లో 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 336 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,301 చేరినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, 56 మంది కరోనాతో మరణించారు. ఇందులో 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు చనిపోయారు. 157 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవడమే కాదు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్యా ఎక్కువగానే ఉన్నది. ఈ రాష్ట్రంలో 335 మందికి కరోనా సోకగా 16మంది మృతి చెందారు. తమిళనాడులో 309 మందికి ఈ మహమ్మారి సోకింది. ఒకరు మరణించారు. తెలంగాణలో 107 మందికి వైరస్ అంటుకోగా ముగ్గురు చనిపోయినట్టు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ తెలిపింది.

Tags: Coronavirus, highest, cases, deaths, crosses, mount

Next Story

Most Viewed