భారత్‌లో ఒమ్రికాన్ కలకలం.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్!

by  |
Corona
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ వివిధ వేరియంట్ల వ్యాప్తి ఏదో ఒక మూల వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేరియంట్ ఇతర దేశాలకు కూడా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న వారికి టెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయింది. కానీ, తదుపరి పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి ఒమ్రికాన్ వైరస్ సోకలేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం..

దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు వ్యక్తులు బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఈ క్రమంలో అధికారులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆ ఇద్దరికి సోకింది ఒమిక్రాన్​ కాదని.. డెల్టా వేరియంట్​అని తేలింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొత్తం మీద 584 మంది వైరస్​తీవ్రత ఎక్కువగా ఉన్న 10 దేశాల నుంచి బెంగళూరుకు వచ్చారు. వారిలో 94మంది దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వాళ్లకి పరీక్షలు జరపగా.. కేవలం ఇద్దరికే వైరస్​ నిర్ధారణ అయినట్టు బెంగళూరు రూరల్​డిప్యూటీ కమిషనర్​ కే. శ్రీనివాస్​ వెల్లడించారు. అయితే.. తదుపరి పరీక్షల కోసం వారి రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపించగా పరీక్షల్లో వారికి డెల్టా వైరస్​ సోకిందని తేలింది తెలిపారు.



Next Story

Most Viewed