విదేశాల్లో తగ్గిన దేశీయ సంస్థల పెట్టుబడులు

by  |
విదేశాల్లో తగ్గిన దేశీయ సంస్థల పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ కంపెనీలు విదేశాల్లో మదుపు చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది జూన్‌లో 2.80 బిలియన్ డాలర్లకు(రూ. 20 వేల కోట్ల)కు చేరుకున్నాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో దేశీయ కంపెనీలు 1.39 బిలియన్ డాలర్లను(రూ. 10 వేల కోట్ల) ఇన్వెస్ట్ చేశాయి. అయితే, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే మన కంపెనీలు విదేశాల్లో పెట్టే పెట్టుబడులు 6.71 బిలియన్ డాలర్ల(రూ. 50 వేల కోట్ల) నుంచి 58 శాతానికి పైగా క్షీణించినట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి.

జూన్ నెలలో మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్ డాలర్లు(రూ. 8 వేల కోట్లకు పైగా) గ్యారెంటీ ఇష్యూ కాగా, 1.21 బిలియన్ డాలర్లు(రూ. 9 వేల కోట్లు) రుణాలుగా ఇవ్వబడ్డాయి. ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడులు 426.84 మిలియన్ డాలర్లు(రూ. 3,200 కోట్లు)గా ఉన్నాయి. ప్రధాన పెట్టుబడిదారుల్లో టాటా స్టీల్ సింగపూర్‌లోని అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు, అమెరికాలో విప్రోలో 788 మిలియన్ డాలర్లు, మారిషస్‌లో 121 మిలియన్ డార్లలను ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సింగపూర్‌లో వ్యవసాయం, మైనింగ్ ఆధారిత కంపెనీలో 56 మిల్యన్ డాలర్లు, ఇంకా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి.


Next Story

Most Viewed