అశ్విన్ తిప్పేశాడు.. 134 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

by  |
అశ్విన్ తిప్పేశాడు.. 134 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. టీం ఇండియా బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా, బౌలింగ్ లోనూ దుమ్ములేపింది. డే2 మ్యాచ్‌లో టీం ఇండియా బౌలర్లు విరుచుకపడటంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఇండియా విధించిన 329 టార్గెట్ ఛేదించే క్రమంలో కేవలం 139 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు.

రవి చంద్రన్ అశ్విన్ 23 ఓవర్లలో కేవలం 43 పరుగులు ఇచ్చి 5వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు కూడా విజృంభించడంతో ఇండియా ప్రస్తుతం 195 పరుగుల ఆధిక్యాన్ని కనబరిచింది. లంచ్ బ్రేక్ అనంతరం రెండో ఇన్సింగ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు చేజార్చుకున్నామనే కసితో భారత ఆటగాళ్లు రెండో టెస్టులో చెలరేగి ఆడుతున్నట్లు క్రికెట్ ఫాన్స్ అనుకుంటున్నారు.

Next Story

Most Viewed