కివీస్‌ ముందు స్వల్ప స్కోరు.. టీమిండియాకు ఓటమి తప్పదా..?

by  |
కివీస్‌ ముందు స్వల్ప స్కోరు.. టీమిండియాకు ఓటమి తప్పదా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజీలాండ్‌పై టీమిండియా స్వల్ప స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేశారు. ఏ ఒక్క ఆటగాడు కనీసం 26కు మించి పరుగులు చేయలేకపోయారు. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మాన్‌లు ఇషాన్ కిషన్ (4), కేఎల్ రాహుల్ (18) రోహిత్ శర్మ (18) దారుణంగా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్ పరిస్థితి కూడా ఇలాగే సాగింది. విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (12), హార్దిక్ పాండ్యా (23) నిలదొక్కుకోలేకపోయారు. రవీంద్ర జడేజా (26 ) నాటౌట్‌గా నిలవగా శార్దుల్ ఠాకూర్ డకౌట్ అయ్యాడు. మహ్మద్ షమీ క్రీజులోకి వచ్చినా బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. దీంతో 7 వికెట్ల నష్టానికి టీమిండియా 110 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.



Next Story

Most Viewed