ఏపీలో పెరుగుతున్న కరోనా తీవ్రత.. గడిచిన 24 గంటల్లో ఏకంగా..

by  |
ఏపీలో పెరుగుతున్న కరోనా తీవ్రత.. గడిచిన 24 గంటల్లో ఏకంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. మొన్నటివరకు తగ్గిన కరోనా వ్యాప్తి.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న కరోనా కేసులే దీనికి నిదర్శనం. గత కొద్దిరోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 1288 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఐదుగురు మరణించగా.. 610 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 7,225 మంది మరణించినట్లు పేర్కొంది.

ఇప్పటివరకు మొత్తం 9,04,548 కేసులు నమోదయ్యాయని, ఇందులో 8,88,508 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,815 ఉన్నట్లు స్పష్టం చేసింది.

Next Story

Most Viewed