ఆ ప్రాజెక్ట్‌కు… భారీగా పెరిగిన పర్యాటకుల సందడి

by  |
ఆ ప్రాజెక్ట్‌కు… భారీగా పెరిగిన పర్యాటకుల సందడి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో జిల్లాలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, మర్పల్లి, మోమిన్పేట్, నవాబుపేట్, శంకర్‌పల్లి, చేవెళ్ల తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నుంచి పర్యాటకులు భారీ స్థాయిలో ప్రాజెక్టుకు చేరుకున్నారు.

గత ఐదేళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండడంతో ప్రాజెక్టు కళకళలాడుతుంది. దీంతో ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చే పర్యాటకులు ఆదివారం భారీ సంఖ్యలో ప్రాజెక్టుకు చేరుకున్నారు. మత్తడి దుంకుతున్న ప్రాంతంలో పలువురు యువతీ, యువకులు సరదాగా సెల్ఫీలు తీసుకుంటూ సేద తీరుతున్నారు. గత రెండు రోజులుగా వర్షం తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.

Next Story