బిగ్ బ్రేకింగ్.. సినీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రభుత్వం షాక్

by  |
బిగ్ బ్రేకింగ్.. సినీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రభుత్వం షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. సినిమా టికెట్ల ధరలను పెంచింది. రేట్ల పెంపుపై సర్కార్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం.. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.50, గరిష్టంగా రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ ల్లో కనీస టికెట్ ధర రూ.100, గరిష్టంగా రూ.250, స్పెషల్ రిక్లైనర్ సీట్ల ధర రూ.300 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. సినిమా టికెట్ల రేట్లపై అదనంగా జీఎస్టీ చార్జీలు విధించింది. నిర్మాతల డిమాండ్ తో టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.


Next Story