తెలంగాణ ట్రాన్స్‌కో ఉద్యోగులకు గుడ్ న్యూస్ 

by  |
తెలంగాణ ట్రాన్స్‌కో ఉద్యోగులకు గుడ్ న్యూస్ 
X

దిశ, తెలంగాణ బ్యూరో : ట్రాన్స్‌కో ఉద్యోగులు, ఆర్టీజన్లుగా పనిచేస్తున్న వారికి, పెన్షనర్లకు ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అలవెన్సులు పెంపు చేసిందని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, ఆర్టీజన్లకు ఈ ఏడాది జనవరి నుంచి అలవెన్సులు 19.165 శాతం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. పెన్షనర్లకు కూడా ఇదే క్రమంలో అలవెన్సులు అందించనున్నారు. దీంతో ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు కొంత ఉపశమనం లభించనుంది. ఈ ఏడాది జనవరి నుంచి పెరిగిన అలవెన్సులను చెల్లించాల్సి ఉంది. కాగా ఈ బకాయిలను ఏప్రిల్‌లోగా చెల్లించాల్సి ఉంది.

Next Story

Most Viewed