రెండు నెలల్లో రూ. 26,276 కోట్ల రీఫండ్లు చెల్లించిన ఐటీ విభాగం!

by  |
Income Tax department
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 15.47 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 26,276 కోట్ల పన్ను రీఫండ్లను చెల్లించినట్టు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం తెలిపింది. ఇందులో 15.02 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 1,538 కోట్ల విలువైన వ్యక్తిగత ఆదాయ పన్ను రీఫండ్లు చెల్లించింది. 44,531 కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ. 18,738 కోట్ల రీఫండ్లను చెల్లించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. అయితే, చెల్లించిన పన్ను రీఫండ్లు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవో ఐటీ విభాగం వెల్లడించలేదు. ఇక, ఈ ఏడాది మార్చితో ముగిసిన 2020-21 మొత్తం ఆర్థిక సంవత్సరానికి 2.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 2.62 లక్షల కోట్ల విలువైన పన్ను రీఫండ్లను చెల్లించినట్టు ఐటీ విభాగం ఓ ప్రకటనలో వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన రీఫండ్లు 2019-20లో చెల్లించిన 1.83 లక్షల కోట్లతో పోలిస్తే 43.2 శాతం ఎక్కువ కావడం గమనార్హం.



Next Story

Most Viewed