హుజూర్నగర్‌లో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే శానంపూడి

by  |
హుజూర్నగర్‌లో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే శానంపూడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్ట్‌లకు సమీపంలో హుజుర్ నగర్ ఉందని డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో పరిశ్రమలు ఐటీ రంగాల ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. నేరేడుచర్ల‌లో ఆటోమొబైల్ పార్క్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు. లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు అభినందనీయమన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.


Next Story

Most Viewed