విజయవాడలో ఘోర ప్రమాదం 

by  |
విజయవాడలో ఘోర ప్రమాదం 
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో కొండచరియలు విరిగి నివాసాల మీద పడటంతో ఒకరు మృతి చెందగా… నలుగురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ కొండ ప్రాంతం నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో ఇల్లంతా ధ్వంసం అయి, మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. భవానిపురం పోలీసులు తక్షణమే స్పందించి మట్టిని తొలగించి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించనా ఫలితం దక్కలేదు. కాగా ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడినట్టు సమాచారం.

Next Story