- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కామారెడ్డి రూరల్ : బైక్ పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు చోరీ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలం క్యాసం పల్లి గ్రామానికి చెందిన వడ్ల లత అనే మహిళ శనివారం సాయంత్రం గ్రామం నుంచి కామారెడ్డికి నడుచుకుంటూ వెళ్తుండగా వర్షం పడుతుండడంతో అటువైపుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని బైకు ఆపి లిఫ్ట్ అడిగింది. ఇదే అదనుగా భావించిన సదరు వ్యక్తి బైక్పై లతను ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లగానే ఎవరూ రాకపోవడంతో బండిని నిలిపి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తస్కరించి వెళ్ళిపోయాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు ఇంటికి వచ్చి కుటుంబీకులు, గ్రామస్తులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి బైక్ పై వచ్చినట్టుగా కనిపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ, బైక్ ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.