నిర్మల్‌లో చిరుత బీభత్సం.. గొర్రెల మందపై ఎటాక్

by  |
leopard
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా కడెం మండలంలో చిరుతపులి కలకలం రేపింది. కడెం ప్రాజెక్టు దగ్గర గొర్రెల మందపై మంగళవారం చిరుత దాడి చేసింది. సినిమాను తలపించేలా ఒక్కసారిగా ఎటాక్ చేసి, మందలోంచి ఒక గొర్రెను అటవిలోకి లాక్కెళ్లింది. దీంతో గొర్రెలతో పాటు స్థానిక ప్రజలు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులను సమన్వయం చేసుకొని చిరుత కోసం గాలిస్తున్నారు.



Next Story

Most Viewed