- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వేములవాడ: ఉన్న ఊరిలో కూలీ పనులు లేక మమ్మల్ని పోషించేందుకు కానరాని దేశాలకు వెళ్ళిన మా నాన్నను, అక్కడి కంపెనీ వాళ్ళు జీతాలు ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నాలుగు రోజులుగా తిండి,తిప్పలు లేక అవస్థలు పడుతున్న మా నాన్న ను ఎలాగైనా ఇంటికి రప్పించాలని ఓ కూతురు వేడుకుంటున్న వైనం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోతు రాములు నాలుగేళ్ల క్రితం సౌదీ అరేబియా లోని డెవలప్మెంట్ గ్రూప్ కంపెనీ లో లేబర్ పనిపై వలస వెళ్ళాడు గత ఆరు నెలలుగా కంపెనీ జీతాలు చెల్లించకుండా రాములను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంటికి పంపించమన్నప్పటికీ పాస్ పోర్ట్ దగ్గర పెట్టుకొని ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం నాలుగు రోజులుగా తినకుండా పస్తులు ఉంటున్నాడు. తన తండ్రి కంటతడి పెట్టుకుంటూ..పంపిన వీడియో మమల్ని ఆందోళనకు గురి చేస్తోందని రాములు కూతురు శైలజ వాపోయింది. ఎలాగైనా తన తండ్రిని జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించి ఇంటికి రప్పించెలా చేయాలని వేడుకుంటుంది. మరి శైలజ విన్నపంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.