టాయిలెట్ వచ్చిందని మైదానంలో పరుగు!

by  |
టాయిలెట్ వచ్చిందని మైదానంలో పరుగు!
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. లీగ్ మ్యాచ్‌లు ముగిసినా ప్లేఆఫ్స్, ఫైనల్స్ జరగలేదు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటం, ఆసియా కప్ కూడా వాయిదా వేయడంతో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అర్థాంతరంగా నిలిచిపోయిన పీఎస్ఎల్ ప్లేఆఫ్స్‌ను నిర్వహిస్తున్నది.

కాగా ఈ మ్యాచ్‌లలో అనుకోకుండా జరిగిన సంఘటనలు ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశాయి. మ్యాచ్ జరుగుతుండా ఒక కుక్క వచ్చి మైదానంలో కూర్చున్న సంఘటన మరువక ముందే మరో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. లాహోర్ ఖలాండర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ అర్థాంతరంగా మ్యాచ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులను ఈ విషయం అర్థం కాకపోయినా.. మైదానంలోని ఇతర క్రికెటర్లు అతడు వెళ్లిన తర్వాత నవ్వుకున్నారు. ఎందుకంటే.. హఫీజ్‌కు టాయిలెట్ రావడంతో అత్యవసరంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు తీశాడంటా. రెండు ఓవర్ల పాటు ఆపుకున్నా.. తర్వాత ఒక ఓపిక పట్టలేక మైదానం వదిలి వెళ్లాడు. ఈ విషయం తెలిసి సహచర క్రికెటర్లు తెగనవ్వుకున్నారు.



Next Story

Most Viewed