- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: పతంజలి కరోనిల్ టాబ్లెట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ధ్రువీకరించిందని అబద్ధాలాడటం, ఆ ఔషధాన్ని విడుదల చేస్తున్న కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొనడం దారుణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే శక్తి కరోనిల్ ఔషధానికి ఉన్నదని పతంజలి వాదించింది. అయితే, ఈ ఔషధాన్ని తాము గుర్తించలేదని డబ్ల్యూహెచ్వో వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఐఎంఏ స్పందించింది.
దేశ ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్ధన్ ఒక అశాస్త్రీయ ఔషధ ఉత్పత్తిని దేశ ప్రజల కోసం విడుదల చేయడాన్ని ఏ విధంగా సరిపుచ్చుకుంటారని ప్రశ్నించింది. కరోనాను ఎదుర్కొనే ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు జరిగిందని? దాని టైమ్ ఫ్రేమ్ ఏమిటో వివరించాలని అడిగింది. దేశానికి ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరమున్నదని డిమాండ్ చేసింది.
Next Story