కేంద్ర మంత్రి వివరణ ఇవ్వాలి.. ఐఎంఏ డిమాండ్

by  |
కేంద్ర మంత్రి వివరణ ఇవ్వాలి.. ఐఎంఏ డిమాండ్
X

న్యూఢిల్లీ: పతంజలి కరోనిల్ టాబ్లెట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ధ్రువీకరించిందని అబద్ధాలాడటం, ఆ ఔషధాన్ని విడుదల చేస్తున్న కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొనడం దారుణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే శక్తి కరోనిల్ ఔషధానికి ఉన్నదని పతంజలి వాదించింది. అయితే, ఈ ఔషధాన్ని తాము గుర్తించలేదని డబ్ల్యూహెచ్‌వో వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఐఎంఏ స్పందించింది.

దేశ ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్ధన్ ఒక అశాస్త్రీయ ఔషధ ఉత్పత్తిని దేశ ప్రజల కోసం విడుదల చేయడాన్ని ఏ విధంగా సరిపుచ్చుకుంటారని ప్రశ్నించింది. కరోనాను ఎదుర్కొనే ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు జరిగిందని? దాని టైమ్ ఫ్రేమ్ ఏమిటో వివరించాలని అడిగింది. దేశానికి ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరమున్నదని డిమాండ్ చేసింది.


Next Story

Most Viewed