ఆ పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

by  |
ఆ పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి బారిన పడకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ ఫిజికల్ ఫిట్ నెస్ ను కాపాడుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఒలింపిక్ డే సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసం నుండి రాష్ట్రంలో ఒలింపిక్ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఆయన ఒలింపిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా క్రీడా పాలసీ రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. క్రీడా పాలసీ సబ్ కమిటీలో అనుభవజ్ఞులైన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావుల ఆలోచనల విధానము ద్వారా ప్రముఖ కోచ్ లు, క్రీడాకారులను సంప్రదించి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకవచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, కార్యవర్గ సభ్యులుతోపాటు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed