నేను క్షేమంగా ఉన్నా: పటాన్‌చెరు ఎమ్మెల్యే

by  |
నేను క్షేమంగా ఉన్నా: పటాన్‌చెరు ఎమ్మెల్యే
X

దిశ, పటాన్‌చెరు: తాను క్షేమంగానే ఉన్నానని, తన ఆరోగ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కాగా, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి, అతని కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయం విధితమే. సోమవారం ఈ మేరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.

Next Story