టీకా తీసుకున్న ఏఎన్‌ఎమ్‌కు అస్వస్థత

by  |
టీకా తీసుకున్న ఏఎన్‌ఎమ్‌కు అస్వస్థత
X

దిశ, జనగామ: కరోనా టీకా వేసుకున్న మహిళకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎమ్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొత్తపల్లి విజయలక్ష్మి ఇవాళ కరోనా టీకా తీసుకుంది. కోవిడ్ టీకా తీసుకున్న వెంటనే తల తిప్పుతుందని, కళ్లు తిరుగుతున్నాయని ఉన్నపలంగా కింద పడిపోయింది. దీంతో ఆందోళన చెందిన ఇతర సిబ్బంది ఆమెకు బీపీ చెక్ చేసి, జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, విజయలక్ష్మికి ఎలాంటి ఇబ్బంది లేదని పరీక్షించిన వైద్యులు తెలిపారు.



Next Story

Most Viewed