స్పీకర్ తమ్మినేనికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

by  |
ap assembly speaker tammineni sitaram
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మంగళవారం ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తమ్మినేని. అయితే ఇటీవలే తమ్మినేని సీతారాం దంపతులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడిన దంపతులిద్దరూ శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొంది అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే సీతారం మళ్లీ అనారోగ్యానికి గురికావడంపై ఆందోళన నెలకొంది.



Next Story

Most Viewed