నైట్‌ కర్ఫ్యూలో అధికార పార్టీ నాయకుడి అక్రమాలు

by  |
నైట్‌ కర్ఫ్యూలో అధికార పార్టీ నాయకుడి అక్రమాలు
X

దిశ, బాల్కొండ: నైట్ కర్ఫ్యూను అదునుగా చేసుకొని పలువురు అక్రమార్కులు వ్యాపారం మొదలుపెట్టారు. భీమ్‌‌గల్‌‌ పట్టణ కేంద్రంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ, 8 తర్వాత వ్యాపారాలు, ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదని స్యాండ్ మాఫీయా గ్యాంగ్ రెచ్చిపోతోంది. రాత్రి అయ్యిందంటే చాలు ఎడ్ల బండ్ల సహాయంతో ఇసుకను నింపి వేరే చోట డంప్ చేస్తున్నారు. అదే సమయంలో అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

అధికార పార్టీ నాయకుడి హస్తం..

అక్రమ ఇసుక రవాణా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ తతంగం నడుస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. కర్ఫ్యూ సమయంలోనే ఇలా చేస్తే.. సాధారణ సమయంలో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed