అక్రమ రవాణాలో కీలకంగా మారిన గాడిదలు..

by  |
sand copy
X

దిశ, పుల్కల్: ఇసుక అక్రమ రవాణా కొరకు అక్రమదారులు కొత్త కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఈ క్రమంలో నది పరివాహక ప్రాంతలోకి ట్రాక్టర్‌లు వెళ్లడం కష్టంగా మారడంతో వారు ఏకంగా అక్కడికి గాడిదలను పంపి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలో గల మంజీరా నది నుండి అర్ధరాత్రి సమయంలో అధికారుల కళ్ళు కప్పి అక్రమ రవాణా చేస్తున్నారు. పరివాహక ప్రాంత రైతుల పంటలు ఇసుక అక్రమ రవాణా వల్ల భీట్లుగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇసుకను నదిలోపలి నుండి గాడిదల ద్వారా ఒడ్డుకు తెచ్చి ట్రాక్టర్‌లతో అక్రమంగా తరలిస్తున్నారని రైతులు తెలిపారు. ఈ విషయంపై అధికారులు త్వరగా స్పందించాలని రైతులు కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed