టీమ్ ఇండియాతో ఫ్లైట్ ఎక్కుతాం : గ్లెన్ మ్యాక్స్‌వెల్

by  |
టీమ్ ఇండియాతో ఫ్లైట్ ఎక్కుతాం : గ్లెన్ మ్యాక్స్‌వెల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే ఫ్లైట్‌లపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురు క్రికెటర్లతో పాటు ఒక అంపైర్ ఆసీస్ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్లు లీగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. దీనికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఐడియా ఇచ్చాడు. ‘ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎలాగో టీమ్ ఇండియా ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ వెళ్తున్నది. ఇక్కడ బయోబబుల్ దాటి బయట ఉండటం కష్టం కాబట్టి.. మమ్మల్ని టీమ్ ఇండియా వెళ్లే విమానంలో పంపించేయండి. ఇంగ్లాండ్ వెళ్లి మా తంటాలేవో మేము పడి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లిపోతాం’ అని చెప్పాడు. నేనైతే ఆ ఫ్లైట్‌లో వెళ్లడానికే ఇష్టపడతాను.. మిగతా వాళ్లు మాత్రం వారి ఇష్టం వచ్చిన రూట్లో వెళ్లొచ్చు అని చెప్పాడు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రతీ ఆటగాడిని ఇంటికి సురక్షితంగా చేర్చే బాధ్యత తమదే అని బీసీసీఐ ఇంతకు ముందే చెప్పింది.

Next Story

Most Viewed