- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్:
పెరుగుతున్న కాలుష్యం, వనరుల అతివినియోగం కారణంగా భూమి రోజురోజుకీ జీవించడానికి వీలు లేకుండా పోతోంది. దీంతో అంతరిక్షంలో అంటే చంద్రుడు, అంగారకుడు వంటి ఉపగ్రహగ్రహాల మీద నివాసాలు ఏర్పరచగలిగే సాంకేతికతను పరిశోధకులు రూపొందిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అంతరిక్ష ఇటుకను తయారు చేశారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇస్రో సంస్థలు సంయుక్తంగా ఈ అంతరిక్ష ఇటుకను తయారు చేశారు. భవిష్యత్తులో భూమ్మీద పర్యావరణ సహిత నివాసాలు ఏర్పరుచుకోవడానికి కూడా ఈ ఇటుక ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
బయోమినరలైజేషన్ అనే విధానం ద్వారా ఈ ఇటుకను తయారు చేసినట్లు ప్రొఫెసర్ అలోక్ కుమార్ తెలిపారు. బయోమినరలైజేషన్ అనేది ఎప్పట్నుంచో భూమ్మీద జరుగుతున్న పద్ధతి. సముద్రంలోపల ఆల్చిప్పలు గట్టిగా, తేలికగా ఉండటానికి కారణం అవి బయోమినరలైజేషన్ పద్ధతిలో ఏర్పడటమే. ఇదే పద్ధతి ద్వారా తయారు చేసిన ఈ అంతరిక్ష ఇటుకలు కూడా గట్టిగా తేలికగా ఉంటాయని అలోక్ కుమార్ చెప్పారు. ముందుగా ఇస్రో పరిశోధకులు లూనార్ సాయిల్ సిమ్యులంట్ అనే ప్రత్యేకమైన మట్టిని తయారుచేశారు. ఇది రసాయనిక సమ్మేళనంలో దాదాపు చంద్రుని మీద దొరికే మట్టితో 99 శాతం సరిపోలింది. ఈ మట్టికి స్పోరోసార్చిన పాశ్చరీ అనే బ్యాక్టీరియా కలిపి బయోసిమెంటేషన్ ద్వారా గట్టి పడేలా చేసి ఇటుకను తయారుచేశారు.