క్షీణించిన ద్రవ్యోల్బణం.. పారిశ్రామికోత్పత్తి వృద్ధి

by  |
క్షీణించిన ద్రవ్యోల్బణం.. పారిశ్రామికోత్పత్తి వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం 2021, జనవరిలో స్వల్పంగా 4.06 శాతానికి తగ్గింది. 2020 డిసెంబర్‌లో సీపీఐ 4.59 శాతం వద్ద ఉంది. అలాగే, 2020, డిసెంబర్‌కు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 1.04 శాతం పెరిగింది. నవంబర్‌లో ఇది 2.09 శాతం ప్రతికూలంగా నమోదైనట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఐపీ డేటా ప్రకారం…గతేడాది డిసెంబర్‌లో తయారీ రంగ ఉత్పత్తి 1.6 శాతం పెరిగింది. మైనింగ్ ఉత్పత్తి 4.8 శాతం క్షీణించగా, విద్యుత్ ఉత్పత్తి 5.1 శాతం పెరిగింది. ఉక్కు, ఎరువుల ఉత్పత్తి తగ్గడం వల్ల కీలక ఎనిమిది పరిశ్రమల ఉత్పత్తి 2020, డిసెంబర్‌లో 1.3 శాతం కుదించుకుపోయింది.


Next Story

Most Viewed