డీజీపీకి రెండో డోస్ కొవిడ్ వ్యా క్సిన్

by  |
డీజీపీకి రెండో డోస్ కొవిడ్ వ్యా క్సిన్
X

దిశ,క్రైంబ్యూరో : కేంద్రప్రభుత్వం పోలీసు శాఖలో రెండు లక్షల సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. దీనిలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫిబ్రవరి 6న మొదటి డోస్ వ్యాక్సిన్ ను తిలక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో తీసుకున్నారు.కాగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వాక్సిన్ ను తీసుకున్నారు. అంబర్ పేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు మెడికల్ ఆఫీసర్ గీతారాణి ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రోజు ఎంత మంది పోలీస్ అధికారులు వ్యాక్సిన్ తీసుకుంటున్నారనే విషయాన్ని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.



Next Story

Most Viewed