పుల్వామాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

by  |
పుల్వామాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దు జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పుల్వామా జిల్లాలోని గంగూ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. సీఆర్‌పీఆఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు ఐఈడీని పేల్చినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు ఉగ్రవాదుల పనే అని అనుమానిస్తున్నారు. ఈ పేలుడులో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన జవానులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం సీఆర్‌పీఎఫ్ జవానులు గాలింపు చేస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story

Most Viewed