- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోన్నయెస్ బ్యాంకును ఆదుకునేందుకు దిగ్గజ ప్రయివేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ,కొటక్ మహింద్రా బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ యెస్ బ్యాంకులో 49శాతం వాటాను కొనుగోలు చేసేందుకు డీల్ కూడా కుదుర్చుకుంది. తాజాగా ఐసీఐసీఐ రూ.1000కోట్లు ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తాము కూడా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పిన దిగ్గజ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ రూ.1000కోట్లు, యాక్సిక్ బ్యాంకు రూ.600కోట్లు, కోటక్ మహింద్రా రూ.500కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నయెస్ బ్యాంకుపై కేంద్రంతో షరుతులు విధించడంతో పాటు, ఆర్బీఐ మారటోరియం విధించింది. దీంతో ఖతాదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అయితే యెస్ బ్యాంకును ఆదుకునేందుకు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ముందుకు రావడం, పెట్టుబడులు పెట్టడంతో తమ ఇబ్బందులు తప్పనున్నాయని కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags: yes bank, icici, axis bank, kotak, hdfc, sbi, 1000crore and 600crore,500crore financial crisis