టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వాయిదా

by  |
టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వాయిదా
X

న్యూఢిల్లీ: ఐసీసీ నిర్వహించనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వాయిదా పడింది. మూడేళ్ల క్రితం ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం, టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఈ ఏడాది జూన్‌ 10 నుంచి 14 తేదీల మధ్య లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ, తాజా మార్పు ప్రకారం, జూన్‌ 18 నుంచి 22 మధ్య నిర్వహించనున్నట్టు ఐసీసీ వెల్లడించింది. 23వ తేదీని రిజర్వ్‌డేగా ప్రకటించింది. అయితే, ఐపీఎల్-2021 షెడ్యూల్ ఇంకా ప్రకటించనప్పటికీ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో తొలి మూడు స్థానాల్లోని భారత్(71.7), న్యూజీలాండ్(70), ఆస్ట్రేలియా(69.2) ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత్ గెలిస్తే, ఫైనల్ బెర్తు ఖాయమైనట్టే. అలాగే, సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ దక్కించుకుంటే ఆసిస్‌కూ ఫైనల్ బెర్తు దక్కే అవకాశం ఉంది. అయితే, టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్‌లో న్యూజీలాండ్ మరో సిరీస్‌ ఆడే అవకాశం లేదు. కాగా, తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌లో చోటు సంపాదిస్తాయి.


Next Story

Most Viewed