బైజూస్ చేతికి ఐసీసీ గ్లోబల్ హక్కులు

by  |
బైజూస్ చేతికి ఐసీసీ గ్లోబల్ హక్కులు
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో అతిపెద్ద ఎడ్యూటెక్ సంస్థ బైజూస్‌ను ఐసీసీ గ్లోబర్ పార్టనర్‌గా నియమించింది. 2021 నుంచి 2023 వరకు ఐసీసీ ఈవెంట్స్‌‌కు సంబంధించిన పలు హక్కులు బైజూస్ దక్కించుకున్నది. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఈ కాలంలో ఐసీసీ ఇండియాలో నిర్వహించే పురుషుల టీ20 వరల్డ్ కప్, న్యూజీలాండ్‌లో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఐసీసీ నిర్వహించే అన్ని ఈవెంట్లకు సంబంధించి ఇన్-వెన్యూ, బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ హక్కులు బైజూస్ దక్కించుకుంది. వినూత్నమైన కార్యక్రమాలు రూపొందించి ఐసీసీకి ప్రచారం చేయడం కూడా బైజూస్ బాధ్యతల్లో ఒకటి. ‘మేము బైజూస్‌తో జట్టు కట్టాము. ఆ సంస్థ మాతో కలసి పని చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మాది ఒక గ్రేట్ ఇన్నింగ్స్‌గా మారుతుందని భావిస్తున్నాము’ అని ఐసీసీ సీఈవో మను సాహ్నీ అన్నారు. కాగా, బైజూస్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు జెర్సీ పార్ట్‌నర్‌గా ఉన్నది.

Next Story

Most Viewed