ఢిల్లీ హింసలో ఐబీ అధికారి మృతి!

by  |
ఢిల్లీ హింసలో ఐబీ అధికారి మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ హింసాత్మక అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్‌‌బాగ్‌లో మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న అంకిత్ శర్మ(25)పై రాళ్లతో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. రాళ్లతో తీవ్రంగా కొట్టి మ‌ృతదేహాన్ని చాంద్‌బాగ్ సమీపంలోని ఓ నాలాలో దుండగులు దాచిపెట్టినట్టు అనుమానిస్తున్నారు. దాడి ఎప్పుడు జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా, బుధవారం ఉదయం అంకిత్ శర్మ మృతదేహం నాలాలో లభించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ అల్లర్లలోనే పోలీసు రతన్‌లాల్ మృతిచెందిన విషయం తెలిసిందే.

Next Story