- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఢిల్లీ హింసాత్మక అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్బాగ్లో మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న అంకిత్ శర్మ(25)పై రాళ్లతో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. రాళ్లతో తీవ్రంగా కొట్టి మృతదేహాన్ని చాంద్బాగ్ సమీపంలోని ఓ నాలాలో దుండగులు దాచిపెట్టినట్టు అనుమానిస్తున్నారు. దాడి ఎప్పుడు జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా, బుధవారం ఉదయం అంకిత్ శర్మ మృతదేహం నాలాలో లభించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ అల్లర్లలోనే పోలీసు రతన్లాల్ మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story