సెకండ్ ఫేజ్‌లో వ్యాక్సిన్ తీసుకుంటా: అమరీందర్ సింగ్

by  |
సెకండ్ ఫేజ్‌లో వ్యాక్సిన్ తీసుకుంటా: అమరీందర్ సింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: సెకండ్ ఫేజ్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. మొహాలీలోని సివిల్ హాస్పిటల్‌లో శనివారం వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన సమక్షంలో ముగ్గురు డాక్టర్లకు, హెల్త్ వర్కర్క్స్‌కు మొదటి డోసు ఇచ్చారు.

ఆ తర్వాత వారికి సీఎం మొక్కలను బహుమతిగా ఇచ్చారు. మొదటి ఫేజ్‌లో హెల్త్ వర్కర్స్‌కు మాత్రమే వ్యాక్సిన్ వేస్తామనీ..ఆ తర్వాత ఆర్మీ, పోలీసు సిబ్బందికి వేయనున్నట్టు చెప్పారు. కాగా తొలి దశలో వ్యాక్సిన్ తీసుకోవాలని తాను అనుకున్నట్టు తెలిపారు. కానీ కేంద్ర మార్గదర్శకాలతో తాను వెనక్కి తగ్గినట్టు చెప్పారు. కానీ సెకండ్ ఫేజ్‌లో తాను వ్యాక్సిన్ తీసుకుంటానని వెల్లడించారు.

Next Story

Most Viewed