రూ. 5,649 కోట్ల పన్ను రీఫండ్‌లు చేసిన సీబీడీటీ

by  |
రూ. 5,649 కోట్ల పన్ను రీఫండ్‌లు చేసిన సీబీడీటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7.39 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ. 5,649 కోట్ల రీఫండ్‌లు చేసినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఈ నెల 1-19వ తేదీల మధ్య కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీడీటీ) ఈ మొత్తాన్ని రీఫండ్ చేసినట్టు పేర్కొంది. ఈ మొత్తం బదిలీల్లో 7.23 లక్షల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ. 3,073 కోట్లు, 15,206 కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ. 2,577 కోట్లను రీఫండ్ చేసినట్టు సీబీడీటీ తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సీబీడీటీ 2.38 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ. 2.62 లక్షల కోట్ల రీఫండ్లు బదిలీ చేసినట్టు ఐటీ శాఖ తెలిపింది. అయితే, ఈ రీఫండ్ ఏ ఆర్థిక సంవత్సరానికి అనేది స్పష్టత ఇవ్వలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది అయ్యుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రీఫండ్ చేసిన మొత్తం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో చేసిన దానికంటే 43.2 శాతం ఎక్కువగా నమోదవడం గమనార్హం.

Next Story

Most Viewed