పీసీసీ రేసులో ముందున్నా: జానారెడ్డి

by  |
పీసీసీ రేసులో ముందున్నా: జానారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పీసీసీ పీఠం రేసులో ముందున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం మాజీమంత్రి కమతం రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, పార్టీ మార్పుపై వస్తున్నవి కేవలం ఊహాగానాలేనని పేర్కొన్నారు. తనను ఏపార్టీ నేతలు సంప్రదించలేదు, నేను కూడా ఎవర్నీ సంప్రదించలేదన్న జానారెడ్డి.. త్వరలో కాంగ్రెస్‌ పార్టీకి మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed