ఐపీఎల్‌ను అడ్డుకుంటున్న కరోనా.. నేటి మ్యాచ్ సంగతేంటి..?

by  |
ఐపీఎల్‌ను అడ్డుకుంటున్న కరోనా.. నేటి మ్యాచ్ సంగతేంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభన సమయంలో ప్రారంభమైన ఐపీఎల్‌ 2021కు వైరస్ అడ్డు తగులుతూనే ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. దీనికి తోడు రేపు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడలేమంటూ సీఎస్కే కూడా తేల్చి చెప్పింది. చెన్నై జట్టులో కూడా ముగ్గురు కరోనా బారిన పడడంతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే నేడు జరగాల్సిన మ్యాచ్‌పై కూడా అభిమానుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ షెడ్యూల్ ప్రకారం 7.30 గంటలకు జరగాల్సి ఉంది. కానీ, ఈ మ్యాచ్‌ జరుగుతుందో లేదో అన్న విషయం మధ్యాహ్నాం వరకు స్పష్టత వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed