దేశానికే హెల్త్‌హబ్‌గా హైదరాబాద్ : ఈటల

by  |
Health Minister Etela Rajender
X

దిశ, రాజేంద్రనగర్: దేశానికే హెల్త్‌హబ్‌గా హైదరాబాద్ మారిందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం శంషాబాద్‌లో ప్లూటస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి అనేకమంది పేషెంట్లు చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని, ఇక్కడ అతి తక్కువ ధరలో వైద్యం అందిస్తున్నారని తెలిపారు. శంషాబాద్ పట్టణం తక్కువ సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, అలాంటి ప్రాంతలో తన మిత్రులు డాక్టర్ వేణుగోపాల్, శ్రీకాంత్, శివ కాంత్ బృందం హాస్పిటల్ ప్రారంభించి వైద్యసేవలు అందించే ప్రయత్నం చేయడం ఆనందంగా ఉందన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అరకులో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారన్నారు.



Next Story

Most Viewed