కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీపీ అంజనీకుమార్

by  |
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీపీ అంజనీకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో విడత కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా పాతబస్తీలోని పేట్లబర్జులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ సురక్షితమని.. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. పోలీసు సిబ్బంది తమ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.



Next Story

Most Viewed