డ్రోన్‌తో నిఘా.. పరుగో పరుగు

by  |

హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్‌ను రాజధాని పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని బీఎన్ రెడ్డి కాలనీలో పోలీసు అధికారులు కంట్రోల్ రూం నుంచి డ్రోన్‌ కెమెరాతో పర్యవేక్షిస్తుండగా, కొందరు చెట్ల కింద గుమిగూడి కనిపించారు. గమనించిన అధికారులు కంట్రోల్ రూం నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులకు సమాచారమివ్వడంతో వారు క్షణాల్లో అక్కడికి చేరుకుని చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Next Story