మనీశ్ పాండే అరుదైన రికార్డు

by  |
మనీశ్ పాండే అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అనూహ్య విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్‌మెన్ మనీశ్ పాండే అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు. టోర్నీలో 3 వేల రన్స్​ మైలురాయిని చేరిన ఆటగాళ్ల లిస్ట్‌లో 16వ క్రికెటర్​గా పాండే నిలిచాడు. ఈ జాబితాలో విరాట్​ కోహ్లీ టాప్ ప్లేసులో ఉండగా, సురేశ్​ రైనా, రోహిత్​ శర్మ, నాలుగో స్థానంలో డేవిడ్​ వార్నర్​ కొనసాగుతున్నాడు.

Next Story

Most Viewed