మేయర్‌, ఎమ్మెల్యేకు కరోనా గుబులు

by  |
మేయర్‌, ఎమ్మెల్యేకు కరోనా గుబులు
X

దిశ, న్యూస్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఇప్పుడు కరోనా గుబులు పట్టుకుంది.ఈ నెల 1న ముషీరాబాద్ డివిజన్ పరిధిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేయర్, ఎమ్మెల్యేలతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు విద్యానగర్‌లోని షణ్ముఖ హోటల్‌లో టీ తాగారు. హోటల్‌లో పనిచేస్తున్న మాస్టర్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు బుధవారం వైద్యాధికారులు వెల్లడించారు. మేయర్‌తో కలిసి ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరికి కూడా కరోనా సోకినట్టు మంగళవారం తేలింది. ఈ నేపథ్యంలో తమకు కూడా కరోనా సోకిందేమోనని మేయర్, ఎమ్మెల్యేలకు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి మేయర్, ఎమ్మెల్యేలు ఇలా కరోనా భయంతో బెంబేలెత్తుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిబంధనల ప్రకారం వీరిద్దరూ కరోనా టెస్టుల అనంతరం క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ వెళ్తారో..లేదో చూడాలి మరి..!

Next Story