రంగయ్య మృతిపై హైదరాబాద్ సీపీ ఎంక్వైరీ

by  |
రంగయ్య మృతిపై హైదరాబాద్ సీపీ ఎంక్వైరీ
X

దిశ, కరీంనగర్ :
మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటీవల మరణించిన శీలం రంగయ్య మృతిపై హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మంగళవారం విచారణ ప్రారంభించారు.రంగయ్య స్వగ్రామం రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం మైదుపల్లి గ్రామంలో మిగతా ఇద్దరు సహా నిందితుల నుంచి కూడా పలు వివరాలు సేకరించారు.ఆ తర్వాత మంథని పోలీస్‌స్టేషన్‌లో రంగయ్య మృతిచెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు పూర్వపరాలు పరిశీలించాక ఆయన హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు.అంతకు ముందు నాగమణి అనే న్యాయవాది దళిత వ్యక్తి అయిన రంగయ్య అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయమూర్తి ఆదేశాల మేరకు హైదరాబాద్ సీపీ కేసు విచారణలో భాగంగా ఈరోజు మంథనికి విచ్చేశారు.

Next Story