- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్ సిటీ: 2 హాళ్లు, 14 టేబుళ్లు, 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తేలబోతుంది. మంగళవారం నిర్వహించనున్న ఉప ఎన్నిక లెక్కింపు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వగా, తీసుకున్న ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. మొత్తం 306 ఈవీఎంలు పోలింగ్ కోసం వినియోగించామన్నారు. 22 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నట్లు, ఒక్కో రౌండుకు 14 ఈవీఎంలలో పోలైన ఓట్లు గణించనున్నట్లు పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనే రాజకీయ పార్టీల అభ్యర్థులు, వాళ్ల ఏజెంట్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ సాగుతోందని, కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు ఇచ్చే శిక్షణ కూడా పూర్తి అయినట్లు ఆదివారం తెలిపారు.