జేఈఈలో హుస్నాబాద్ విద్యార్థి ప్రతిభ..!

by  |
జేఈఈలో హుస్నాబాద్ విద్యార్థి ప్రతిభ..!
X

దిశ, హుస్నాబాద్: సెప్టెంబర్‎లో జరిగిన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో హుస్నాబాద్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. పట్టణానికి చెందిన మేరుగు యువరాజ్ 97.32 మార్కులతో 7,218 ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శనివారం నవభారత్ హైస్కూల్ కరస్పాండెంట్ లింగపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. యువరాజ్ పాఠశాల దశ నుంచే చదువు పట్ల పట్టుదల, సృజనాత్మకతో చదివేవాడన్నారు. జేఈఈలో యువరాజ్ ప్రతిభ కనబర్చడటం పట్ల టీచర్లు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed