దారుణం: ఓ పక్క భర్త అంత్యక్రియలు.. మరోపక్క భార్య గదిలో

by  |
దారుణం: ఓ పక్క భర్త అంత్యక్రియలు.. మరోపక్క భార్య గదిలో
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరూ ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు.. ఎంతో అందమైన జంట అని నలుగురు పొగుడుతుంటే వారి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ వారి అన్యోన్యత చూసి దేవుడికి కూడా కళ్లు కుట్టాయి. పెళ్లై పదకొండు నెలలు కూడా కాకముందే వరుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. భర్తే తన సర్వసం అనుకున్న ఆమెకు తన భర్త లేడన్న విషయాన్ని జీర్ణించుకులేక.. భర్తతోనే నేను అంటూ ఆత్మహత్య చేసుకొని కన్నుమూసింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లికి చెందిన కిరణ్(30)కు వారి పక్క గ్రామానికి చెందిన పూజా(22) కు 11 నెలల క్రితం వివాహమైంది. తమ అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని ఎన్నో కలలు కన్నారు. అయితే అప్పుడే కిరణ్ కి గుండెకు సంబంధించిన సమస్య బయటపడింది. వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూనే శనివారం ఉదయం కిరణ్ మృతిచెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త మరణవార్త విన్న పూజా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఏడడుగులు వేసి జీవితాంతం తోడు ఉంటానన్న భర్త తనని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడని రోదించిన పూజా భర్త అంత్యక్రియలు అనంతరం ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇద్దరు బిడ్డలను కళ్ళముందే పోగొట్టుకున్న రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. దాంపత్య జీవితానికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట మరణం స్థానికంగా సంచలనంగా మారాయి

Next Story

Most Viewed