రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అనుమానంతో భర్త ఏంచేశాడంటే?

by  |
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అనుమానంతో భర్త ఏంచేశాడంటే?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను వేటకొడవలితో హతమార్చిన ఘటన జిల్లాలోని బంట్వారం మండల పరిధిలోని మాధ్వపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. భార్య కాశ లక్ష్మి పై భర్త ఆంజనేయిలుకు అనుమానం ఉండేది దాంతో వారిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అయితే శనివారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది దాంతో భార్య లక్ష్మి ని వేట కొడవలితో నరికేశాడు. అయితే భార్యపై అనుమానంతోనే నరికి చంపినట్లు తెలుస్తుంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story